బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR(వర్కింగ్ టైటిల్).యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఇటీవలే ప్రారంబోత్సవం జరుపుకుంది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచే మొదలు కానుంది.ఈ విషయాన్ని రాజమౌళియేస్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి షాట్ను తమ కెమెరాలో బందించింది ఆద్యా మీడియా.రామ్ చరణ్,ఎన్టీఆర్లపై మొదటి షాట్ను షూట్ చేశారు రాజమౌళి.
చరణ్ రెడీ…తారక్ రెడీనా ఓకే ఓకే ..రెడీ క్లాప్ అంటూ రాజమౌళి RRR సినిమా మొదటి సీన్ని షూట్ చేశారు.ఇప్పటి వరకు తన సినిమ కథ ఇది అని బయటికి చెప్పలేదు రాజమౌళి.కియారా అద్వానీ,కీర్తి సురేష్లను హీరోయిన్లుగా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.సినిమా రెగ్యూలర్ ఫూటింగ్ మొదలు కావడంతో చిత్ర యూనిట్కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.డివివి దానయ్య ఈ సినిమాను 2019 చివరికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.