Friday, April 19, 2024
- Advertisement -

డెంగు జ్వరంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు

- Advertisement -

ప్రస్తుతం దర్శకుడు సుజిత్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తో మంచి హిట్ అందుకున్నాడు సుజిత్. అదే జోరుతో తన రెండవ సినిమాని ఏకంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వంటి హీరోతో తీసే అదృష్టాన్ని పొందాడు. మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ విడుదలైన మొదటి రోజి నుండే సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. స్టార్ కాస్ట్, స్టార్ టెక్నిషియన్లు కూడా ఈ సినిమా ని డివైడ్ టాక్ నుండి కాపడలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘సాహో’ ఫెయిల్యూర్ లో అందరూ సుజిత్ వైపే వేలెత్తి చూపుతున్నారు.

అసలే మెంటల్ గా బోలెడంత ప్రెజర్ లో ఉన్న సుజిత్ కి తాజాగా డెంగు సోకింది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ ఆసుపత్రి కి వెళ్లగా పలు టెస్టులు నిర్వహించి డాక్టర్లు అది డెంగు అని నిర్ధారించారు. సుజీత్ ఒంట్లో బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సుజిత్ ని వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చూసుకుంటున్నారట. కానీ ట్రోలర్లు మాత్రం ‘సాహో’ సినిమా విషయంలో సుజిత్ పై ఫైర్ అవుతూనే ఉన్నారు. జ్వరం కంటే సుజిత్ ని ఈ ట్రోలింగ్ ఎక్కువగా బాధిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -