Friday, March 29, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీనీ లీక్ చేసిన రచయిత..!

- Advertisement -

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తుండటం ఈ సినిమాకి మరో స్పెషల్. దాదాపుగా ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రెంజ్ సినిమానే మళ్లీ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. నిజానికి సాయి మాధవ్ బాహుబలి చిత్రానికే పనిచేయాల్సింది. కానీ కొన్ని కారణాల చేత అది కుదరలేదు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి పనిచేస్తున్నందుకు ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఇక ఇటీవలే ఆయన మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ సినిమాని రాజమౌళిగారు ఎప్పుడో చూసేశారని.. దాన్ని ప్రేక్షకులకు చూపించడానికి కష్టపడుతున్నారని అన్నారు. ఇక సినిమా కథ గురించి చెబుతూ.. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో స్వాతంత్ర సమయంలో పాల్గొన్న వీరుల్లో అల్లూరి సీతారామ రాజు, కొమరం భీంలు. ఈ ఇద్దరు బ్రిటీష్ వారిపై పోరాటం చేశారు. అయితే కొంతకాలం వేరు అజ్ఞాతంలో ఉన్నారు.

అలా అజ్ఞాతంలో ఉండగా ఈ ఇద్దరు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తున్నారట. ఇది చారిత్రాత్మక నేపధ్యం కలిసిన సినిమా అయినప్పటికీ ఇందులో చాలా వరకు కల్పితం ఉంటుందట. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -