Tuesday, April 23, 2024
- Advertisement -

అమలాపాల్ మాజీ భ‌ర్త‌తో సాయి ప‌ల్ల‌వి పెళ్లి..?

- Advertisement -

హీరోయిన్ సాయి పల్ల‌వి కెరీర్ స్టార్టింగ్ నుంచి నిత్యం ఏదో ఒక రూమ‌ర్స్‌తో వార్త‌ల్లో నిలుస్తునే ఉంటుంది. ఆ మ‌ధ్య పారితోష‌కం గురించి గొడ‌వ చేయ‌గా, ఆ త‌రువాత హీరోతో పాటు స‌మానంగా త‌న పాత్ర కూడా ఉండ‌ల‌ని కండిష‌న్ పెట్టింద‌నే వార్త మీడియాలో వ‌చ్చింది. తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సాయి ప‌ల్ల‌వి పెళ్లికి రెడి అయింద‌ట‌. ఇందులో త‌ప్పు ఏముంది అనుకుంటున్నారా..? సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకోవ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. అయితే రెండో పెళ్లి వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటుంద‌ట సాయి ప‌ల్ల‌వి. త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ను పెళ్లి చేసుకోవడానికి సాయి పల్లవి సిద్దమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. విజ‌య్‌కు గ‌తంలో పెళ్లి అయింది. విజ‌య్ పెళ్లి చేసుకుంది మ‌రెవ్వ‌రినో కాదు హాట్ హీరోయిన్ అమలాపాల్‌ను. అవును అమలాపాల్‌ను ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకున్నాడు విజ‌య్‌.

అయితే పెళ్లి త‌రువాత సినిమాలు మానేయ‌మ‌నందుకు అత‌నికి విడాకులు ఇచ్చి మ‌రి సినిమాల్లో న‌టిస్తుంది అమ‌లాపాల్. ఆమెతో విడిపోయిన త‌రువాత విజ‌య్ సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు. సాయి ప‌ల్ల‌విని లీడ్ రోల్లో క‌ణం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు విజ‌య్‌. ఈ సినిమా స‌మ‌యంలో వీరిద్ద‌రు దగ్గ‌రయ్యార‌ని స‌మాచారం. ఒక వేళ ఈ వార్త నిజం అయితే సాయి ప‌ల్ల‌వి పెళ్లి త‌రువాత తెర మీద క‌నిపించ‌దు. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ కథనాలపై సీరియస్‌గా కామెంట్ చేస్ట్సున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. కొంచెమైనా సిగ్గుందా అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండ‌ని సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఆమె పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సిన అవ‌స‌రం అయితే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -