Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రోమోతోనే ఆకట్టుకున్న ‘సామజ వరగమన’

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత రాబోతున్న మూడవ సినిమా ‘అల వైకుంఠపురం లో’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘డీజే’ సినిమాలో బన్నీ తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట ప్రోమోని విడుదల చేశారు. ‘సామజవరగమన’ అని సాగే ఈ పాట ప్రోమో కేవలం 20 సెకన్ల నిడివి మాత్రమే ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంటోంది.

సినిమాకి సంగీతాన్ని అందించిన ఎస్.ఎస్.తమన్ తన సంగీతంతో మరొక చార్ట్ బస్టర్ ని ఇవ్వబోతున్నాడని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. కేవలం తన గొంతుతోనే ప్రేక్షకులను మైమరపించగలిగే సిడ్ శ్రీరామ్ ఈ పాటను పాడటం విశేషం. ప్రముఖ గేయ రచయిత సీతారామ శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ ను అందించారు. ఈ పాట లిరికల్ వీడియో త్వరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్టోబరు 8న దసరా సందర్భంగా సినిమా టీజర్ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -