Thursday, April 18, 2024
- Advertisement -

నాగ‌ర్జున‌తో మ‌రోసారి స‌మంత‌…!

- Advertisement -

అక్కినేని ఇంటి కోడ‌లు మ‌రోసారి నాగ‌ర్జునతో క‌లిసి న‌టించ‌నుంది. గ‌తంలో వీరిద్ద‌రు మ‌నం, రాజుగారి గ‌ది 2 సినిమాలో న‌టించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌నున్నారు. నాగ్ ప్రస్తుతం మ‌న్మ‌థుడు2 సినిమా తీయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు హీరో రాహుల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ న‌టిస్తోంది.

స‌మంత ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. రాహుల్ ఈ పాత్ర కోసం సమంత‌ను ఒప్పించిన‌ట్లు స‌మాచారం.త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోంది. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలి సినిమాలో న‌టిస్తోంది. త‌మిళ 96 రీమేక్ మూవీలో కూడా క‌నిపించ‌నుంది. వీటితో పాటు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి మ‌రో సినిమాలో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -