సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుడు వెలిగిన చాలామంది చివరి దశలో డబ్బులు లేక మరణించినవారు చాలామందే ఉన్నారు. ఇలా చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటుంది అలనాటి నటి సావిత్రి. తెలుగు , తమిళ భాషలలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి దశలో డబ్బులు లేక మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది మరో నటి. కన్నడ భాష ఒకప్పుడు స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగింది విజయలక్ష్మి.ప్రస్తుతం విజయలక్ష్మి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. బెంగుళూర్ ఆసుపత్రిలో చిక్కిత్స తీసుకుంటుంది విజయలక్ష్మి. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు లేని దీనస్థితిలో ఉంది.ఆమెకు కనీస ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె సోదరి అభిమానులను వేడుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. వెండితెర మీద స్టార్గా ఉన్న విజయలక్ష్మి , ఇప్పుడు సినిమాలలో అవకాశాలే లేక సీరియల్స్లో నటిస్తుంది.
విజయలక్ష్మి తెలుగులో కూడా నటించింది. హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు, అర్జున్ సిస్టర్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల అధిక ఆమె రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తెలుస్తోంది. తల్లికి ఆరోగ్యం కోసం తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఖర్చు చేసిందట విజయలక్ష్మి. ఇప్పుడు విజయలక్ష్మి దగ్గర రూపాయి కూడా లేదని అందుకే అభిమానులను ఆర్థికసహాయాన్ని కోరుతున్నట్లు ఆమె సోదరి చెబుతున్నారు. మరి ఈ విషయం తెలుసుకుని అయిన కన్నడ సినీ పరిశ్రమ ఆమెకు ఆర్ధిక సాయం చేస్తుందో లేదో చూడాలి.
- Advertisement -
ఆస్పత్రికి డబ్బులు కట్టలేని దీనస్థితిలో హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -