Thursday, April 25, 2024
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో తో అర్జున్ రెడ్డి డైరెక్టర్

- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ వంగ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. తాజాగా అదే సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసిన సందీప్ వంగా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇలా వరుసగా రెండు హిట్లు కొట్టడంతో సందీప్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక సందీప్ వంగ తదుపరి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ స్వయంగా సందీప్ వంగ ని పిలిపించి తన కోసం ఒక కథ రాయమని అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకున్న సందీప్ ఈ సినిమాకి రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి షూటింగ్ త్వరలో మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారట. అయితే ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ సందీప్ వంగ తన తదుపరి సినిమా ఒక క్రైమ్ డ్రామా అని అది మరింత బోల్డ్ మరియు వివాదాస్పదంగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథ ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తయింది కానీ ఇంకా కథ మాత్రం పూర్తవలేదట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -