బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. బాహుబాలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాతో బాలీవుడ్ జనాలు సైతం రాజమౌళి నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. . అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్గా తారక్ కనిపించనున్నారు. రామ్ చరణ్ పక్కన ఆలియా హీరోయిన్గా నటిస్తుండగా, హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కనిపించనుంది.
ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ను తీసుకున్న రాజమౌళి, ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను తమ సినిమాలో బుక్ చేసుకున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, సంజయ్ దత్ను ఈ చిత్రంలోని కీలక పాత్రలకు దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నటిస్తామని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డివీవీ దానయ్య నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ సినిమాకు ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరుపించుకోవాలని భావిస్తున్నాడు రాజమౌళి.