Friday, March 29, 2024
- Advertisement -

సరిలేరు.. అల వైకుంఠపురములో.. ఏది పెద్ద హిట్ అంటే ?

- Advertisement -

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి హిట్స్ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతలో వేసుకున్నాడూ సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెర్కకెకిన ఈ సినిమా వసూళ్ల వర్షం కూరిపిస్తోంది. ఈ సినిమాకి మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర ప్రేక్షకులు కూడా బ్రహ్మారధం పడుతున్నారు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా .47 కోట్లు రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే ఇది అల్ టైమ్ రికార్డు. ఇక రెండో రోజు విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. మూడో రోజుకి 100 కోట్లు దాటే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మహేష్ ’మహర్షి’ సినిమా మొదటి రోజు రూ. 24.68 కోట్లును కొల్లగొట్టింది.

ఇక టాలీవుడ్ లో ఓవరాలుగా చూస్తే మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులో ’సరిలేరు నీకెవ్వరు’ నాలుగో ప్లేస్ (32.77 కోట్ల) లో ఉంది. మొదటి స్థానంలో బాహుబలి 2 (43 కోట్లు), రెండో స్థానంలో ‘సాహో’ ( 36.63 కోట్లు), మూడో స్థానంలో ‘సైరా’ (36.37 కోట్లు) సినిమాలు ఉన్నాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మరో సినిమా ’అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్ట్‌లు అంచనాలు వేస్తున్నారు. ఇందులో షేర్ రూ. 30 కోట్లు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సో ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ పరిశిలీస్తే.. మహేష్ బాబు టాప్ లో ఉన్నాడని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ మహేష్ ను అందుకోలేకపోయాడు.

ఏది ఏమైన ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -