Thursday, April 25, 2024
- Advertisement -

సరిలేరు : వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్..!

- Advertisement -

మాములుగా టాలీవుడ్ లో మహేశ్ బాబుకు స్టోరీ చెప్పి ఒప్పించడం అనేది చాలా పెద్ద సవాల్. ఎందుకంటే మహేష్ సినిమా హిట్ అవుతే ఏ రెంజ్ లో ఉంటుందో.. ప్లాప్ అవుతే కూడా అదే రెంజ్ లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఓ స్టోరీ విన్నప్పుడు అందులో అన్ని అంశలు తనకు ఓకే అనిపిస్తే తప్ప ఆ సినిమాని ఒప్పుకోడు మహేష్. ఒక్కసారి స్టోరీ ఓకే చేస్తే ఇక దర్శకుడు ఏం చెబితే అది చేస్తారు మహేష్ బాబు.

మాములుగా అయితే ఎక్కువగా సినీయర్ దర్శకులకే మహేష్ బాబు అవకాశం ఇస్తూ ఉంటారు. కానీ అనిల్ రావిపూడి విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు మహేష్. అనిల్ రావిపూడి సాధించిన వరుస హిట్లు .. కంటెంట్ పై ఆయన పెట్టే శ్రద్ధ .. ఆయన టేకింగ్ మహేశ్ బాబుకి నచ్చాయి. అందుకే వెంటనే అనిల్ రావుపూడి చెప్పిన సరిలేరు నీకెవ్వరు సినిమా కథను ఓకే చేశారు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ విజయాన్ని సాధించింది.

విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100న కోట్ల షేర్ ను సాధించింది. ‘భరత్ అనే నేను’.. ‘మహర్షి’ సినిమాల తరువాత 100 కోట్ల షేర్ ను సాధించిన 3వ చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం విశేషం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మీక నటించగా.. ముఖ్యపాత్రలో విజయశాంతి నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అనిల్ సుంకర్, దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -