అక్కినేని నాగచైతన్య ఇటీవలే శైలజా రెడ్డి అల్లుడితో హిట్ కొట్టాడు. ఈ సినిమా తరువాత చైతు నటించిన సవ్యసాచి సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ:హిమాచల్ ప్రదేశ్కు వెళ్తున్న టూరిస్ట్ బస్ లో ఒకరికొకరు పరిచయం లేని 21 మంది ప్రయాణికులు ఉంటారు. అయితే కాస్సేపటికి వారి మాటల్లో వారందరికీ అరుణ్ అనే వ్యక్తి లింక్ ఉందని అర్థమవుతుంది. పరిచయం లేని తమకు ఓకే వ్యక్తి పరిచయం ఉండటం ఏమిటని షాక్ అవుతారు. ఈ లోగా … బస్సు లోయలో పడి ప్రమాదానికి గురవుతుంది. ఆ బస్ లో ఉన్న విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) మినహా అందరూ చచ్చిపోతారు. విక్రమ్ ఒక్కడే ఎలా బ్రతికి బయిటపడ్డాడు అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంతకీ విక్రమ్ ఎవరు… అతనో యాడ్ ఫిలిం మేకర్. మేనకోడలు మహాలక్ష్మి కూడా చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. కానీ ఓ చిన్న లాజిక్ తో ఆ పిల్ల బ్రతికే ఉందని, ఓ అజ్ఞాత వ్యక్తి (మాధవన్) కిడ్నాప్ చేసారని తెలుసుకుంటాడు. ఇంతకీ మహాలక్ష్మిని ఎందుకు కిడ్నాప్ చేసారు. వారి ఉద్దేశ్యమేమిటి.. విక్రమ్కి అజ్ఞాత వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయా..? మొదటి చెప్పుకున్న బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ చిత్రమైన సమస్యల నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు..? ఎడమ చేతి కథేంటి.. సినిమాలో హీరోయిన్ చిత్ర(నిధి అగర్వాల్) క్యారెక్టర్ ఏమిటి అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:ఎడమ చేతి సమస్య అనే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. తెలుగులో అదే జరగలేదు. తెలుగులో దాన్ని కేవలం ఓ ఎలిమెంట్ గా వాడారంతే. ఆ విషయం ప్రక్కన పెడితే సినిమా ఫక్తు రివేంజ్ స్టోరీ. అందులో ఎడమ చేయి ఇబ్బంది అనేది ఉన్నా లేకపోయినా కథలో ఒక్క సీన్ లో కూడా మార్పు రాదు. ఈ సినిమాలో విలన్ గా చేసిన మాధవన్ పాత్ర విషయానికి వస్తే.. అతను పాపను కిడ్నాప్ చేసిన కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అలాంటి సంఘటనలు బయిట జరగొచ్చేమో కానీ ఈ సినిమా కు ఉన్న బిల్డప్ కు తేలిపోయింది. విలన్ పాత్ర ఇంటర్వెల్ దాకా రాదు. హీరోకు ఫలానా వ్యక్తి విలన్ ..అని తెలుసుకునే సరికే దాదాపు ప్రీ క్లైమాక్స్ వచ్చేస్తుంది . దాంతో ఎంతసేపూ విలన్ ..హీరోని ఆడుకోవటమే కానీ..హీరో తిరగబడి విలన్ ని ఎదుర్కోవటమనేది ఉండదు. చివర్లో తప్పదు అన్నట్లు విలన్, హీరోల మధ్య ఓ ఫైట్ పెట్టి క్లోజ్ చేసేసారు. విలన్ , హీరోకు సరిగ్గా కాన్ఫ్లిక్ట్ లేకపోవటంతో సినిమా తేలిపోయింది. ఈ సినిమాలో నాగచైతన్య గొప్పగా చేసాడు అనలేం కానీ ..అలా చేసుకుంటూ పోయాడు ఎప్పటిలాగే. అయితే రొటీన్ గా లేకుండా కొంచెం కొత్తగా అనిపించాడు. నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ జస్ట్ ఓకే. నటన గురించి మాట్లాడటానికి ఆమెకు అసలు సీన్స్ ఉంటే కదా. సెకండాఫ్ లో అయితే గెస్ట్ రోల్ అనుకుంటాం. వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్ తమ కామెడీ టైమింగ్ తో కాస్త రిలీఫ్ ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం:డైరక్ట్రర్ చందు మొండేటి మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ ఈ సినిమా కథనే చాలా లేజీగా అల్లుకున్నాడనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కాలేజీ సీన్స్ సహనానికి పరీక్షగా మారాయి. ఇంటర్వెల్ దగ్గర మాధవన్ ఎంట్రీ దాకా అసలు కథపై ఇంట్రస్టే ఉండదు. అదేదో కాస్త ముందర మాధవన్ ని తీసుకొస్తే ఫస్టాప్ లో బోర్ కొట్టే సీన్స్ తగ్గిపోయేవి. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అని టైటిల్స్ చూడకపోతే గుర్తించలేం. అంత నాశిరకంగా ఉన్నాయి. రీమిక్స్ సాంగ్ కూడా తేలిపోయింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలెట్ గా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అని టైటిల్స్ చూడకపోతే గుర్తించలేం. అంత నాశిరకంగా ఉన్నాయి. రీమిక్స్ సాంగ్ కూడా తేలిపోయింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలెట్ గా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి.
బోటమ్ లైన్:చైతుని మళ్లీ మాయ చేశారుగా..!