- Advertisement -
మంచి కాఫీ లాంటి సినిమాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల తరువాతే ఎవరైనా.ఆనంద్,హ్యాపీడేస్,గోదావరి,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్,ఫిదా సినిమాలతో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల.ఈ క్రమంలో ఈయన మరో ప్రేమ కథను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది.రాయలసీమ నేపథ్యంలో ఓ సినిమాను తీయడానికి శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు.
ఇందులో కూడా కథానాయికగా ‘ఫిదా’ నాయిక సాయిపల్లవిని తీసుకుంటున్నారట. శేఖర్ కమ్ముల అనేసరికి కథ ఏంటీ అని కూడా అడగలేదటా సాయిపల్లవి.ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.