Thursday, April 25, 2024
- Advertisement -

టైటిల్ లేక ప్రమోషన్స్ చేయట్లేదా?

- Advertisement -

యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం లో ఈ నటుడు ఎప్పుడో ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు కానీ అది ఇప్పటికీ ఇంకా వెలుగు చూసింది లేదు, సినిమా సంగతి అటు ఉంచితే, కనీసం సినిమా కి సంబందించిన ప్రచార చిత్రానికి సంబందించిన విశేషాల ను కూడా అందుబాటులోకి తీసుకురాలేదు దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా కి ఇప్పుడు టైటిల్ పెట్టె పని లో ఉన్నారట చిత్ర యూనిట్.

సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిపోయిన తరుణం లో ప్రచారం మొదలు పెట్టాలంటే టైటిల్ తప్పనిసరి. ఇప్పటి వరకు అందరూ మెచ్చే టైటిల్ ని వారు ఖరారు చేయకపోవడం తో ప్రమోషన్స్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమా కి ఇంతకు ముందు రణరంగం, వ్యూహం వంటి టైటిల్స్ ని అనుకున్నారు కానీ ఏ ఒక్క టైటిల్ కూడా ఫైనల్ చేయలేదు.

కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ని దసరా పండగ కి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో శర్వానంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -