Saturday, April 20, 2024
- Advertisement -

ప్రమోషన్స్ గురించి పట్టించుకోనంటున్న శర్వా

- Advertisement -

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ‘రణరంగం’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. సినిమా విడుదలకి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దర్శకుడు మరియు హీరోయిన్లు చిత్ర ప్రమోషన్స్ లో భాగానే పాల్గొంటున్నారు. కానీ హీరో అయ్యుండి కూడా శర్వానంద్ ఒక్క ప్రమోషన్ ఇంటర్వ్యూలో కూడా కనిపించక పోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై బాగానే ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ కూడా తన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కోసం దాదాపు పదిహేను రోజులపాటు ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. కానీ విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ శర్వానంద్ మాత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టకపోవడం ఏంటా అని అందరూ ఆలోచిస్తున్నారు. తన సొంత సినిమాకి శర్వానంద్ ఇలా చేస్తుంటే ఇక తనని ఏ నిర్మాత నమ్మి ముందుకు వస్తారని అభిమానులు సైతం నిరాశ పడుతున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -