Saturday, April 20, 2024
- Advertisement -

బాబా భాస్కర్ ని టార్గెట్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ

- Advertisement -

ఈ మధ్యనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఎంటరైన శిల్ప చక్రవర్తి బిగ్ బాస్ హౌస్ లో గొడవలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వెంటనే శిల్పా చక్రవర్తి ముందుగా బాబా భాస్కర్ ని టార్గెట్ చేసి అతనితో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె తో సరదాగా మాట్లాడుతూ బాబా భాస్కర్ మహా అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో వారం ఉంటుంది అని కామెంట్ చేశారు. దీన్ని పట్టుకుని శిల్ప చక్రవర్తి పెద్ద గొడవ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఇంటి సభ్యులందరూ దీనిపై పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడంతో ఆమె కూడా సైలెంట్ అయిపోయింది.

అదేరోజు మరి కొన్ని కొన్ని గంటల తర్వాత మళ్లీ బాబా భాస్కర్ వద్ద అదే టాపిక్ తీసుకువచ్చి కార్నర్ చేయడానికి ప్రయత్నించింది. బాబా భాస్కర్ తన కాన్ఫిడెన్స్ ని చంపేస్తున్నారు అని కామెంట్ లు చేస్తూ అరవడం మొదలు పెట్టింది. కానీ బాబా భాస్కర్ మళ్లీ ఆ టాపిక్ ని సరదాగా కప్పి పెట్టేసారు. చూస్తూ ఉంటే శిల్పా చక్రవర్తి ఇంట్లో గొడవలు తీసుకురావడానికి తన స్క్రీన్ టైం పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ని వాడుతున్నట్లు తెలుస్తోంది. కానీ అభిమానులు కూడా బిగ్ బాస్ హౌస్ లో తన ప్రవర్తనతో ఏమాత్రం సంతోషంగా లేనట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -