సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులు అవుతున్నా పుష్ప సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోకపోవడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అయితే రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి…
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సుకుమార్ కి అన్ని అడ్డంకులే వస్తున్నాయి.. అదిగో ఇదిగో అంటున్నా ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు.. అందుకు కారణం లేకపోలేదట.. ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. దాంతో ధృవ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్న. కానీ అరవింద్ స్వామి కూడాఈ సినిమా చేయడానికి సముఖంగా లేదు.. దాంతో పరభాషల్లోని నటులకు వెళ్లడం ఎందుకని అనుకున్నారో ఏమో ఈ విలన్ పాత్ర కు యంగ్ హీరో నారా రోహిత్ ని పరిశీలిస్తున్నారట.. ఇప్పుడు అది కూడా కాకుండా మాధవన్ ని సినిమా లో విలన్ గా ఫిక్స్ చేయాలనీ చూస్తున్నారట.. ‘సవ్యసాచి’ సినిమా ఆడకపోయినా ఆ సినిమాలో విలన్ పాత్రతో మెప్పించి.. ‘నిశ్శబ్దం’లోనూ ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్న మాధవన్ను ‘పుష్ప’లో విలన్ పాత్రకు పరిశీలిస్తున్నారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది.
అయితే వీరిలో ఎవరు పుష్ప విలన్ గా సెట్ కాలేదట..అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ నెలలో కూడా పట్టాలు ఎక్కించే అవకాశం కనిపించడం లేదు. మరి నవంబర్ లో అయినా సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి.
ఆ సినిమా ని మళ్ళీ రీస్టార్ట్ చేసిన రామ్..
నాని సినిమా కి కరోనా బ్రేకులు.. ఇప్పుడెలా..