శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది.ఈ సినిమా తరువాత శ్వేతా బసు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని అందరు భావించారు.కాని అనుకోని కారణాలతో ఆమె కెరీర్ అనేక మలుపులు తిరిగింది. చివరికి జైలు శిక్ష కూడా అనుభవించింది.శ్వేతా బసు సెంకడ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన..అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లుకు తన పెళ్లితో వార్తల్లో నిలిచింది శ్వేతా బసు.
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ఆమె వివాహం చేసుకోనుందని తెలుస్తుంది.కొన్ని రోజుల క్రితమే తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. గోవాలో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణెలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని తెలిపింది. ఇంట్లోవాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని చెప్పింది. శ్వేతా బసు ప్రస్తుతం తెలుగులో ‘గ్యాంగ్ స్టర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.