సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజాలు మా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. పదవి కోసం ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మీడియా ఛానెళ్లకు వెళ్లి మరి నువ్వు ఇంత నొక్కేశావ్ అంటే నువ్వు అంత తినేశావ్ అంటూ వారిలో ఉన్న లొసుగులు బయటపెట్టుకున్నారు. ఎన్నికలకు కూడా ఇదే విధాంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 68 ఓట్ల తేడాతో నరేశ్ విజయం సాధించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు.
కాని నరేశ్ను ప్రమాణస్వీకారాన్ని అడ్డుకున్నారని ఆయన మీడియాతో ఎదుట వచ్చి చెప్పి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు శివాజీ రాజా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేష్ ప్రమాణస్వీకారాన్ని మేం అడ్డుకోలేదని , రూల్స్ ప్రకారం ఈ నెలాఖరు వరకు టైం ఉందని మాత్రమే చెప్పానన్నారు.
ఈ ఎన్నికల్లో నాగబాబుగారు నరేశ్కు మద్దతు తెలిపారని, అయితే ఇప్పుడు తాను నాగబాబుకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు శివాజీ రాజా. ఓల్దేజ్ హోం కట్టడం తన కల అని , దానిపై నీళ్లు చల్లరని మీడియా ఎదుట వాపోయారు శివాజీ రాజా. ఓల్దేజ్ హోం కడితే కాశీ నుండి నీళ్లు తెప్పించి కాళ్లు కడుగుతానని సవాల్ విసిరారు.
- Advertisement -
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న శివాజీ రాజా
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -