సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ఎవరి భావాలను వారు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాల వల్ల కొన్ని సార్ల ఇరు వర్గాల మధ్య గొడవలకు దారి తీస్తోంది. తాజాగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మరోసారి వార్ మొదలయ్యింది.
కొంత కాలం క్రితం జూనియర్ సినిమాలు విడుదల అయినప్పుడల్లా ఆసినిమాల పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వ్యక్తులలో బాలకృష్ణ అభిమానులు ఉన్నారనె వార్తలు వినిపించాయి. దీంతో అప్పట్లో వారి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆతరువాత జూనియర్ బాలకృష్ణ కూతురు పెళ్ళికి కూడ వెళ్ళక పోవడంతో వీరిద్దరి గ్యాప్ ఓపెన్ టాపిక్ గా మారిపోయింది. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందనడంలో సందేహంలేదు.
ఇలాంటి పరిస్థుతులలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేళ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ తిరిగి బాలయ్య , జూనియర్ ల మధ్య చిచ్చు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోతున్న ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అపజయం చెందితే పార్టీ పరిస్థితి ఏంట్నన చర్చ మొదలయ్యింది.
అన్ని సర్వేఫలితాల్లో వైసీపీదే విజయం అని స్పష్టం చేశాయి. వైసీపీ విజయం సాధిస్తే టీడీపీ పరిస్థితేంటి? చంద్రబాబు కి వయోభారం పెరిగిపోవడంతో టీడీపీ ని నడిపే సారథి ఎవరు? అనే ప్రశ్నలు టీడీపీ కార్యకర్తల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో పార్టీని నడపడం బాలయ్యకు గాని, లోకేష్కుగాని కెపాసిటీ లేదన్నది ఇప్పటికే రాష్ట్రప్రజలకు అర్థం అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగల సత్తా ఒక్క జూనియర్ కు మాత్రమే ఉంది అంటూ తారక్ వీరాభిమాని ఒకడు చేసిన కామెంట్ బాలయ్య జూనియర్ అభిమానుల మధ్య మంటలు రేపుతోంది.
దీనికి బాలయ్య ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ పగ్గాలు బాలయ్య చేతికే ఇవ్వాలని వారి వాదన. ఇలా ఒకరు గొప్పేంటే మరొకరు గొప్పంటూ ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మొదలుపెట్టారు. బాలయ్య ఫ్యాన్స్ కామెంట్కు గట్టిగానె బదులిస్తున్నారు జూనియర్ అభిమానులు. ఇద్దరి అభిమానుల మధ్య సోషల్మీడియా వేదికగా ఒ మోస్తరు యుద్దమే జరుగుతోంది.