కరోనా టైంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సహాయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం గొప్పది. ఆపదలో ఉన్నప్పుడూ ఆపద్భాందవుడిగా నిలిచి అందరి మనసులలో హీరో అయ్యాడు సోనూ. లాక్ డౌన్ టైంలో ఆయన చేసిన సామాజిక సేవలు వెలకట్టలేనివి.
వైద్యుల కోసం హోటల్ కేటాయించిన సోనూ సూద్, వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. తన సొంత డబ్బుతో ఇవన్ని చేశాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఆయనను ప్రజలు ప్రశంసించారు. కొందరు అయితే ఆయనకు వీరాభిమానులు అయ్యారు. అయితే ఇప్పటికీ తన తన బాధ్యత ఇంకా పూర్తి కాలేదంటున్నారు సోనూ సూద్.
లాక్ డౌన్ టైంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు.
పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!
హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!