బుల్లితెర యాంకర్స్ శ్రీముఖి, రవిలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి షోలు చేశారు. ముఖ్యంగా పటాస్ షో ద్వారా వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షోలో వీరు అత్యంత సన్నిహితంగా మెలగడంతో.. అప్పట్లో వీరిద్దరిపై విపరితమైన వార్తలు వచ్చాయి.
వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం భారీ ఎత్తున జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వార్తలు సద్దుమణిగాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇద్దరూ కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఈ షోలో ఇదే అంశానికి సంబంధించిన ప్రశ్నపై శ్రీముఖి, రవి క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్నది వృత్తి పరమైన బంధమే తప్ప… వ్యక్తిగత బంధం కాదని శ్రీముఖి, రవి చెప్పారు.
టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటామని… చేతులు పట్టుకోవడం వంటివి చేస్తుంటామని తెలిపారు. ఇలాంటివి చూసి, తమ మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు అనుకుంటుంటారని చెప్పారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని తెలిపారు. తామేంటో తమ కుటుంబ సభ్యులకు కూడా బాగా తెలుసని శ్రీముఖి, రవి చెప్పుకొచ్చారు.