టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి చాలాకాలం తరువాత హైదరాబాద్లో అడుగుపెట్టింది. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై శ్రీరెడ్డి తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలలో అవకాశాలు రావాలి అంటే పక్కలో పడుకోవాలి అని చెప్పి పెద్ద వివాదమే సృష్టించింది.
ఇప్పుడు మరోసారి తెలుగు ఇండస్ట్రీపై పలు విమర్శలు చేసింది. ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివపై సంచలన కామెంట్స్ చేసింది.తెలుగు దర్శకులలో టాప్లో ఉన్న కొరటాల ప్రపంచంలో అందరికంటే వరస్ట్ క్యారెక్టర్ అని అంటోంది నటి శ్రీరెడ్డి. తనకు అవకాశాలు ఇప్పిస్తానని కొరటాల శివ మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఒకవేళ తన బయోపిక్ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివదే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇది విన్న వారందరు కొరటాల శ్రీరెడ్డిని అంతలా మోసం చేశాడా..? అని చర్చించుకుంటున్నారు.లక్ష్మీస్ వీరగ్రంధంలో హీరోయిన్గా నటిస్తుంది ఈ భామ. ఈ సినిమాలో లక్ష్మి పార్వతి క్యారెక్టర్లో నటిస్తుంది శ్రీరెడ్డి.