టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొందరు నాకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నారని చెప్పిన శ్రీరెడ్డి అప్పట్లో పెద్ద ఉద్యమమే చేసింది శ్రీరెడ్డి.ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనని లైంగికంగా వాడుకున్నాడని చెప్పి పెద్ద సంచలనమే సృష్టించింది.తరువాత కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి ,తరువాత దీనిని వ్యక్తిగతంగా తీసుకుని నటుడు పవన్ కల్యాణ్,వారి అమ్మాగారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైంది.దీంతో ఆమెను పాటించుకోవడం మానేశారు.తాజాగా శ్రీరెడ్డి దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేసింది. బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా మరికొన్ని కామెంట్స్ చేసింది.
ఒకప్పుడు తనను చాలా మంది పబ్లిక్ టాయిలెట్ లా వాడారని చెబుతోంది. ఆఫర్లు ఇప్పిస్తామని తనను వేధించినట్లు వెల్లడించింది.”నన్నొక పబ్లిక్ టాయిలెట్ లా వాడారు. ఆ గాయాలు ఎప్పటికీ మానవు. మానసికంగా నన్ను దారుణంగా దెబ్బతీశారు. అప్పుడు జరిగిన సంఘటనలలో నా ప్రమేయం కూడా ఉంది. కానీ ఆఫర్ల కోసం అప్పట్లో కొన్ని పనుల్లో ఓ శవంలా పాల్గొన్నాను. నన్ను నమ్మండి.. మనస్పూర్తిగా నేను ఆ పనులు చేయలేదు.ఇప్పుడు ఓ తమిళ హీరో నా కెరీర్ నాశనం చేయడానికి చూస్తున్నాడు. తెలుగు సినీ జనాలకు కూడా అతడు పరిచయస్తుడే.. అతడు పెద్ద కామ పిశాచి” అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకి ఆ తమిళ హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు శ్రీరెడ్డి.