Thursday, March 28, 2024
- Advertisement -

లారెన్స్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి మ‌రో వివాదానికి తెర లేపింది.ఇప్ప‌టి వ‌రకు తెలుగు ఇండ‌స్ట్రీ వారిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు తాజాగా త‌మిళ ఇండ‌స్ట్రీపై వివాస్ప‌ద వాఖ్య‌లు చేస్తుంది.నిన్న‌(గురువారం) త‌మిళ హీరో శ్రీరామ్ త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను లైంగికంగా వాడుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.ఈ రోజు తాజాగా త‌మిళ డ్యాన్స్ మాస్ట‌ర్‌,హీరో,డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వ లారెన్స్ త‌న‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పింది.లారెన్స్ మెడలో రాఘవేంద్రస్వామి లాకెట్.. రుద్రాక్ష చూసి ఏదో అనుకున్నానని.. కాని అత‌డు త‌న‌తో అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపింది.

నడుం ఇతర శరీర భాగాలు చూపించమన్నాడని తనతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడని శ్రీరెడ్డి పేర్కొంది. లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని ..దీంతో అత‌నితో కొంత‌కాలం పాటు లారెన్స్‌తో నేను ఫ్రెండ్ షిప్‌లో ఉన్నాన‌ని చెప్పింది.అయితే వీరిద్ద‌రి మ‌ధ్య‌లోకి నిర్మాత బెల్లంకొండ‌ని తీసుకువ‌చ్చింది.ఈ ఎపిసోడ్ మొత్త‌నికి బెల్లంకొండ విల‌న్‌గా మారార‌ని త‌న ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చింది.ఇప్ప‌టికే చాలా మందిపై వివాస్ప‌ద కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి తాజాగా త‌మిళ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెట్టినట్లు ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -