శ్రీరెడ్డి ఏం చేసిన సంచలనంగా మారుతోంది. ఆమె మాట్లాడితే వినేవాళ్లకే భయం వేస్తోంది. ఆ మధ్య మీటూ ఉద్యమాన్ని నడిపించి.. సైలెంట్గా కోలీవుడ్లో సెటిలైపోయింది శ్రీరెడ్డి. వంటలకు సంబంధించిన వీడియోలు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది. ఇక అప్పుడు అప్పుడు ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతుంది.
తాజాగా లైవ్ లోకి వచ్చి.. రాకేష్ మాష్టర్ చేసిన కామెంట్స్పై ఫైర్ అవుతూ.. తన విశ్వరూపాన్ని చూపించింది. రాకేష్ మాష్టర్ను తిడుతూ మధ్యలో కరాటే కళ్యాణి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ టార్గెట్ చేసి తిట్టింది. కరాటే కళ్యాణిని రాయలేని పదజాలంతో తిట్టింది. ఎంత మందితో పడుకున్నావో ? ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో తెలుసంటూ విరుచుకుపడింది.
తనకు బాధ కలిగించిన వారి గురించి మాట్లాడితే మీరెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ను అలా తిట్టడం కరెక్ట్ కాదని రాకేష్ మాష్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడంతో.. శ్రీ రెడ్డి మరోసారి పవర్ స్టార్పై విరుచుకుపడింది. వాడు సీఎం కాలేడు.. ఏం పీకలేడు అంటూ తీవ్రమైన పదజాలంతో బూతు పురాణం మొదలు పెట్టింది. పవన్ కు ఆస్తులు లేవని అందరూ అనుకుంటారు.
అందులో నిజం లేదని.. ఎంత ఆస్తి ఉందో తనకు బాగా తెలుసని.. ట్యాక్స్లు కట్టడం లేదని ముందుగా అది కట్టు అని పవన్ కళ్యాణ్ కు సూచించింది. శ్రీరెడ్డి కామెంట్స్ పై పవన్ అభిమానులు ఓ రెంజ్ లో ఫైర్ అవుతున్నారు.