Friday, March 29, 2024
- Advertisement -

మాధవీలత.. నువ్వు ఇంకా పోలేదా ? అంటూ శ్రీరెడ్డి సంచలనం..!

- Advertisement -

యంగ్ హీరోయిన్ మాధవీలత ఇటివలే సోషల్ మీడియాలో త్వరలోనే తాను చచ్చిపోతా అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దాంతో ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఈ నెపథ్యంలో ఈ పోస్టుపై నటి శ్రీరెడ్డి స్పందించి సంచలన కామెంట్ చేసింది. విషయంలోకి వెళ్తే.. మధవీలత తన ఫేస్‍బుక్ లో..”ఐ హేట్ మై హెల్త్ ఇష్యూస్ అంటూ మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నానని.. రోజూ ట్యాబ్లేట్స్ వేసుకోవాల్సి వస్తుందని, ఇంతలా మందులు వాడుతూ పోతే ఏదో ఒకరోజు అవి పనిచేయక ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో” అంటూ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. వెంటనే పరిస్థితి గమనించిన మధవీలత మరోసారి రియాక్ట్ అయింది. “నేను చచ్చిపోవడం లేదు. నాకు చచ్చిపోయేటంత జబ్బేం లేదు. ఏదో క్యాజువల్ పోస్ట్ పెడితే నేను చచ్చిపోతానని స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారు. మెసేజ్‌లు పెడుతున్నారు.. నా చావు మీద నేను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు” అంటూ అని పేర్కొంది. ఈ ఇష్యూపై శ్రీరెడ్డి ఎంటరై సంచలన కామెంట్ చేసింది. “RIP మాధవీలత.. హో సారీ.. ఇంకా పోలేదా?’ అంటూ తన ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి ఫోస్ట్ పెట్టింది. దీంతో మాధవీలత చావు ఇష్యూ మరింత హైలైట్ అయింది.

అయితే మధవీలత ఫ్యాన్స్.. శ్రీరెడ్డిపై మండిపడుతూ.. ముందు నువ్వు పోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా నిలిచింది మాధవీలత. దీంతో టైం చూసుకుని ఆమెపై శ్రీరెడ్డి ప్రతాపం చూపుతోంది. ఇప్పుడిలా చావు వార్తపై స్పందించి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గతంలో కూడా మాధవీలత, శ్రీరెడ్డి మధ్య చాలా సార్లు మాటల యుద్దం జరిగింది. ఫిల్మ్ చాంబర్ ముందు శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనను మధవీలత వ్యతిరేకించింది. అందుకే టైం దొర్కితే మాధవీలతను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -