Saturday, April 20, 2024
- Advertisement -

పెళ్లైన అమ్మాయిలు పద్దతిగా లేరు : శ్రీరెడ్డి

- Advertisement -

సంచలనాత్మక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ద్వారా లాక్ డౌన్ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మహిళలు ఎలా ఉండాలో.. ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే పురుషుడు సంతోషంగా ఉంటాడో చెబుతోంది. ఇప్పుడు శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎలాంటి అమ్మాయి జీవితంలోకి వస్తే మగవారు సుఖపడతారు అనేది శ్రీరెడ్డి చెబుతోంది.

“ఏదైనా సాధించిన.. స్వతంత్రంగా నడుచుకునే.. ఆత్మగౌరవం కలిగిన అమ్మాయిల వల్ల అబ్బాయిలు సుఖంగా ఉంటారు” అంటూ చెబుతోంది. “ప్రతిరోజూ ఏదో విషయంలో ఎమోషనల్గా హత్యాచారం చేసే సీరియల్ యాక్టర్స్ లాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకునేవారు. పద్ధతిగా కనిపించేవారు.. నాన్నకూచి అని చెప్పుకునే బ్యాచ్ అంతా మంచివారని మీరు అనుకుంటే అదో మంచి జోక్ అని సాఫ్ట్ గా హెచ్చరించింది. అంతే కాదు.. పబ్ కు వెళ్ళే అమ్మాయిలంతా చెడ్డవారు కాదని.. ఎవరైనా వారిని బాధపెడితే మరిచిపోయేందుకు అమ్మాయిలు పబ్ కు వెళ్తారని గమనించాలని చెప్పింది.

ఇక తన ఘాటు స్టైల్లో “*** ద్వారా క్యారెక్టర్ నిర్ణయించవద్దు.. మంచి మనసు అమ్మాయిల క్యారెక్టర్ను తెలుపుతుంది” అని శెలవిచ్చింది. లాక్ డౌన్ టైంలో కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలు కొనితెచ్చుకోవద్దని కూడా హితబోధ చేసింది. ఈమధ్య పెళ్లి చేసుకున్న ఆడవారిని శ్రీరెడ్డి గమనిస్తోందట. అయితే వారిలో చాలామంది అసలు పద్దతిగా ఉండడం లేదని.. ఇలాంటి వారి వల్ల సమాజానికి శాంతి చేకూరదని అంటుంది శ్రీరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -