Friday, April 26, 2024
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ మాకు సాయం చేయలేదు: మేఘాంశ్ శ్రీహరి

- Advertisement -

దివంగత నటుడు శ్రీహరి మరణించాక శ్రీహరి భార్య శాంతి తన ఇద్దరు కుమారులని నటులు గా తీర్చి దిద్దాలని అనుకున్నారు. అనుకున్న విధం గా నే ఇద్దరినీ మంచిగా చదివించి ఇప్పుడు సినిమాల్లోకి తీసుకొని వస్తున్నారు. అయితే వారి తనయుడు తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజ్ దూత్. కార్తీక్ అర్జున్ అనే కొత్త కుర్రాళ్ళ ద్వయం ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ఇప్పటికే విడుదల అయింది. ఇక సినిమా కూడా వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రం గురించి మేఘాంశ్ అనేక ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. తన తండ్రి ని ఈ సమయం లో చాలా మిస్ అవుతున్నట్లు అతను తెలిపాడు.

అయితే కొన్ని విషయాలు ఆయన చెప్పనప్పటికీ మీడియా లో అనేక మంది వాటి గురించి రాస్తున్నారు అని మేఘంష్ వాపోయాడు. అయితే ఈ సందర్భం గా మాట్లాడుతూ నాన్న దూరమైన తర్వాత జూ. ఎన్టీఆర్ తమకు సాయం చేశాడని వచ్చిన వార్తల పై స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని. అసలు సాయం పొందాల్సిన స్థితి లో వాళ్ళు ఎప్పుడూ లేరని మేఘాంశ్ తెలిపాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని తను అభిమానిస్తానని, ఎన్టీఆర్ నటన అంటే ఇష్టమని మేఘాంశ్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -