Tuesday, April 16, 2024
- Advertisement -

250 ఎకరాల్లో రాజ‌మౌళి కొడుకు పెళ్లి

- Advertisement -

దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే ఇప్పుడు నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ ఉంది.మ‌రి అలాంటి రాజ‌మౌళి కొడుకు పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా?. రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ వివాహానికి సర్వం స‌న్న‌ద్దం అయింది. త‌న సినిమాల మాదిరిగానే త‌న కొడుకు పెళ్లిని కూడా భారీత‌నంతో  చేస్తున్నాడు రాజ‌మౌళి. పెళ్లి కార్డు నుంచి పెళ్లి మండ‌పం వర‌కు ప్ర‌తిది ప్ర‌త్యేక‌మ‌ని తెలుస్తుంది. త‌న సినిమాల‌లో సెట్టింగ్‌ల మాదిరిగానే వివాహ మండ‌పాన్ని నిర్మించార‌ని స‌మాచారం.

న‌టుడు జగపతిబాబు అన్నయ్య రాంప్రసాద్ కూతురు పూజ ప్రసాద్‌కి రాజమౌళి కొడుకు కార్తికేయకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కార్తికేయ, పూజల వివాహానికి జైపూర్ వేదిక అయింది.  రేపు(డిసెంబర్ 30న) వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. 250 ఎకరాల జైపూర్‌లోని ప్యారామౌంట్ హోటల్లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచే కాక బాలీవుడ్ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు వ‌చ్చార‌ని స‌మాచారం. రాజ‌మౌళి కొడుకు పెళ్లి కోసం టాలీవుడ్ మొత్తం జైపుర్‌కు బ‌య‌లుదేరి వెళ్లింది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్రభాస్‌, నాని, రానా, అనుష్క‌లు ఇలా సినీ ప్ర‌ముఖులు కార్తికేయ పెళ్లికి హాజ‌రైయ్యారు.ఇక పెళ్లిలో మ‌న హీరోలు తెగ హంగామా చేశారు. త‌న కొడుకు పెళ్లి వ‌ల్ల ‘RRR’ షూటింగ్‌కు కాస్తా బ్రేక్ ఇచ్చాడు రాజ‌మౌళి.పెళ్లి ప‌నులు పూర్తి అవ్వ‌గానే తిరిగి ‘RRR’ షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు ద‌ర్శ‌కధీరుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -