Friday, March 29, 2024
- Advertisement -

పుకార్లపై ఫన్నీగా రియాక్ట్ అయిన సీనియర్ నటి

- Advertisement -

సెలబ్రిటీలు అన్నాక వారికి సంబంధించి బోలెడు పుకార్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. అయితే అందులో కొంత మంది స్టార్లు మాత్రమే ఆ పుకార్లను పట్టించుకొని వాటి పై రియాక్ట్ అవుతుంటారు. తాజాగా తన భర్త మీద వచ్చిన పుకార్ల పై చాలా కొత్తగా రియాక్ట్ అయ్యింది సీనియర్ నటి. సుహాసిని భర్త, ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెకి సంబంధించిన కొన్ని ఇబ్బందుల వలన హాస్పటల్లో జాయిన్ అయ్యారు అని, చెకప్ చేయించుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు అని ఈ మధ్యనే వార్తలు వినిపించాయి. ఈ వార్తల పై సుహాసిని సెటైరికల్గా రెస్పాన్స్ ఇచ్చారు.

ఆ రోజు ఉదయం మహిళల సంక్షేమాలు చూసే ఒక ఎన్జీవో నుంచి కోచ్ రూపా ఏదో మీటింగ్ కోసం తన ఇంటికి వచ్చారని, వచ్చేటప్పుడు ఆమె రోటీ మరియు ఆవకాయ పచ్చడి కూడా తీసుకు వచ్చారని చెప్పిన సుహాసిని, ఆ రోటీ మరియు పచ్చడిని మణిరత్నం చక్కగా తినేసి పనికి వెళ్లిపోయారని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది సుహాసిని. తన భర్త హాస్పటల్లో ఉన్నాడు అని కొందరు పుకార్లు పుట్టిస్తున్న సమయంలో మరోవైపు సుహాసిని మణిరత్నం చక్కగా రోటీ మరియు పచ్చడి తినేసి పనికి వెళ్లి పోయారు అని చెబుతూ సుహాసిని సరదాగా ఆ పుకార్లను ఇండైరెక్ట్ గా కొట్టిపారేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -