Friday, March 29, 2024
- Advertisement -

సందీప్ తో పాటు స్టంట్ మాన్ కి కూడా గాయాలు

- Advertisement -

నిన్న సాయంత్రం కర్నూల్ లో షూటింగ్ చేస్తున్న సమయం లో, ఒక బాంబు బ్లాస్ట్ సీన్ ని చిత్రీకరిస్తుండగా, అనుకోకుండా అది పేలడం తో హీరో సందీప్ కిషన్ కి గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్న సందీప్ నిన్న ఈ బాంబు బ్లాస్ట్ సీన్ ని ఎంచుకున్నాడు. అయితే కొంత మంది స్టెంట్ మాస్టర్ తప్పిదం అని అంటున్నారు కానీ సందీప్ కూడా మొండి గా డూప్ లేకుండా షూట్ చేయడం వలన ఇది జరిగింది అనే టాక్ వచ్చింది. అయితే ఈ ఘటన లో సెట్ లో పని చేస్తున్న ఒక స్టంట్ మాన్ కి కూడా గాయాలయ్యాయి.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సందీప్ కిషన్ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. “అందరికీ నమస్కారం. గ్లాస్ బ్లాస్ట్ సీక్వెన్స్ తీస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక మెటల్ పార్టికల్ సరిగ్గా వచ్చి నా ఎడమ కంటి కింద గుచ్చుకుంది. అందు వలన చాలా రక్తం పోయింది, అది చూసి అందరూ కంగారు పడ్డారు. అయితే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. కాకపోతే స్టంట్ మాన్ కి మాత్రం ఇంకా పెద్దగా గుచ్చుకుంది. అతను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అని సందీప్ ట్విట్టర్ లో తెలిపాడు.

ప్రస్తుతం సందీప్ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా లో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -