Saturday, April 20, 2024
- Advertisement -

అదే జరిగితే ఇంక సందీప్ కిషన్ కి సపోర్ట్ లేనట్టే

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో అప్పుడెప్పుడో వచ్చిన స్నేహ గీతం అనే సినిమా తో తెరంగేట్రం చేసాడు సందీప్ కిషన్. ఛాయాగ్రాహకుడు చోటా కె నాయుడు మేనల్లుడు అయినప్పటికీ సందీప్ కిషన్ మాత్రం తన సొంతం గా సినిమాలని చేసుకుంటూ ఎదిగాడు. అయితే సందీప్ ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ తన కెరీర్ లో వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా కి మించిన విజయం ఒక్కటి కూడా రాలేదు. పైగా సందీప్ గత మూడేళ్ళుగా చేసిన అన్ని సినిమాలు పరాజయం బాట పట్టినవే. ఈ దశ లో ఆయన నిర్మాత గా కూడా మారి తన సొంత సినిమా ని నిర్మించారు.

నిను వీడని నీడను నేనే అనే సినిమా తో సందీప్ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దాదాపు చాలా రోజుల తర్వాత సందీప్ మళ్ళీ తెలుగు లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కచ్చితం గా సందీప్ కి హిట్ తీసుకొని రావాల్సిన సినిమా. అందుకనే కాబోలు సందీప్ కిందా మీదా పడి ఎలాగైనా హిట్ కొట్టాలి అని తనకి తెలిసిన అందరూ యువ హీరోల సపోర్ట్ తీసుకొని సినిమా కి కాస్తో కూస్తో ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే ఇక నెక్స్ట్ సినిమా కి సందీప్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -