Saturday, April 20, 2024
- Advertisement -

డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటున్న హీరో

- Advertisement -

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో సందీప్ కిషన్ తాజాగా ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు చిత్ర ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సందీప్ కిషన్ తన సినిమా ఫెయిల్యూర్స్ పై రియాక్ట్ అయ్యాడు. “నేను దాదాపు బోర్డర్ లైన్ డెకరేషన్ దాకా వెళ్ళాను. దాని నుంచి బయటపడటానికి అమెరికా కూడా వెళ్లాల్సి వచ్చింది. సినిమాలకు సంబంధించిన విషయాల్ని నేను మా ఇంట్లో వారితో మాట్లాడాను. నేను వాటి గురించి పంచుకునే ఏకైక వ్యక్తి న చెల్లెలు. తను చాలా తెలివైనది” అని చెప్పుకొచ్చాడు సందీప్.

“స్స్నేహ గీతం’, ‘ప్రస్థానం’ సినిమాలు విడుదలైనప్పుడు నా పేరు ఎవరికీ తెలీదు. నేను మూడు భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పటికీ పెద్ద సినిమాలు చేయాలి అని గ్రాండ్ స్కేల్ అన్న సినిమా లో నటించాలని ఉంది. తమిళ్, హిందీ భాషల్లో ఆ కల నెరవేరింది కానీ తెలుగులో ఇంకా నెరవేరలేదు. అందుకే నాకు నా సొంత గడ్డపై ఓడిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది” అని చెప్పిన సందీప్ కిషన్ దాదాపుగా 30 కథలు విన్న తరువాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను ఎంపిక చేసినట్లు తెలిపారు. మరి సందీప్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -