Thursday, April 18, 2024
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో లో స్టార్ కమెడియన్

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా విడుదలైన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పటిలాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ పూర్తిస్థాయిలో ఉండేలాగా చూసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక స్టార్ కమెడియన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు వెన్నెల కిషోర్.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కోసం త్రివిక్రమ్ ఒక అద్భుతమైన పాత్రను డిజైన్ చేశారని, ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి వెన్నెల కిషోర్ కి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని, అంతేకాకుండా క్లైమాక్స్ లో కూడా వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోతుందని తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ మరియు టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -