Thursday, April 18, 2024
- Advertisement -

సూర్య నిర్ణయం.. అభిమానుల్లో కలవరం

- Advertisement -

తమిళ సినిమా పరిశ్రమ లో ఉన్న అగ్ర హీరోలు ఒకరు సూర్య ఆయన ప్రస్తుతం తన తదుపరి సినిమా బందోబస్త్ కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో ఆయన హైదరాబాద్ కి వచ్చి ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు అయ్యి, ఆ పిమ్మట కొంత మందికి ఇంటర్వూస్ ఇచ్చారు.

ఏ ఇంటర్వ్యూ లో అయినా ఎవరిని అయినా చివరగా అడిగే ప్రశ్న తదుపరి సినిమాల గురించి. అయితే ఈ ప్రశ్నకి జవాబు ఇస్తూ సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా ని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి అభిమానుల్లో కలవరం మొదలైందట.

సాధారణం గా ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాలు రెండు విడుదల కాకుండా ఆగిపోవడం తో ఆయన తో సినిమా అవసరమా అనే దృష్టి తో అభిమానులు చూస్తున్నారు. అనవసరం గా ఎందుకు ఈ సినిమా ని మీద వేసుకోవడం అనే దృక్పథం తో వారు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం సూర్య వరకు చేరిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -