Saturday, April 20, 2024
- Advertisement -

‘సై రా’ నుండి విడుదలైన మరొక అదిరిపోయే ట్రైలర్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ మధ్యనే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమా నుంచి మరొక ట్రైలర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మొదటి ట్రైలర్ కంటే రెండవ ట్రైలర్ సినిమాలోని యాక్షన్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు కచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ మరియు అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మొదటి ట్రైలర్ తోనే బాగా ఆకట్టుకున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు రెండవ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -