Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్: పిక్చర్ అభీ బాకీ హై అంటున్న తమన్నా

- Advertisement -

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో మూడవ సీజన్ మొదలైన రెండు మూడు రోజులకే గొడవలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మొదటి వారంలో నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో నుంచి హేమ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వైల్డ్ కార్డ్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున తమన్నా సింహాద్రి ని వైల్డ్కార్డ్ ఎంట్రీ గా పరిచయం చేశారు. అయితే తాజాగా ఇవాళ తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు.

ఈ నేపథ్యంలో స్టార్ మా చానల్ వారు ఒక ప్రోమోని విడుదల చేశారు. అందులో తమన్నా హౌస్ లోకి ఎంటర్ అవడం, హౌస్ మేట్స్ షాక్ అవ్వడం, బాక్గ్రౌండ్ లో ‘పిక్చర్ అబ్ బీ బాకీ హై మేరా దోస్త్’ అని తమన్నా సింహాద్రి డైలాగ్స్ చెబుతున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లో తమన్నా సింహాద్రి ఎంట్రీ ఉండబోతోందని తెలుస్తోంది. మరి హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇవాళ నామినేషన్ ప్రాసెస్ కూడా జరగబోతుంది. ఈ వారం నామినేషన్స్ కి వెళ్లే వారు ఎవరు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -