Thursday, April 25, 2024
- Advertisement -

సై రా లో తమన్నా ఒక్కతే లక్కీ.. ఎందుకో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అన్నిటికంటే పెద్ద చిత్రం సైరా నరసింహ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంస్థ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు. పంతొమ్మిదవ శతబ్దానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కి చెందిన కథ ఈ సినిమా ద్వారా చెప్పబడుతుంది.

ఈ సినిమా లో నయనతార, తమన్నా, నిహారిక కోనిదెల, బ్రహ్మాజీ, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్ఛా సుదీప్ వంటి వారు ముఖ్య పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమన్నా ఈ సినిమా కి సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇటీవలే మీడియా కి తెలిపింది. ఈ సినిమా లో నటించే వారందరిలో కన్నా తమన్నా చాలా లక్కీ అని చెప్పుకుంటూ వచ్చింది. ఈ సినిమా లో తన పాత్ర కు సంబంచి కాస్ట్యూమ్స్ చాలా ఖరీదైనవి అని తన కెరీర్ లో ఇప్పటి వరకు అంతటి ఖరీధైన లెహంగాలను ధరించి ఎప్పుడు షూటింగ్ చేయలేదు అని వీటిని ప్రత్యేకంగా చిరంజీవి కుమార్తె సుస్మిత డిజైన్ చేసింది అని తెలిపింది.

ఇదే విషయాన్ని చెప్తూ ఔట్ పుట్ చాలా బాగా వస్తుంది అని సినిమా విడుదల అయ్యాక అందరికీ తన పాత్ర నచ్చుతుంది అన్న ఆశ భావం కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ పాండిచ్చేరి లో శరవేగం గా జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -