Friday, March 29, 2024
- Advertisement -

రాజు గారి గది నుండి బయటకొచ్చిన తమన్నా

- Advertisement -

మొన్నీమధ్య నే ఓంకార్ దర్శకత్వం లో రాజు గారి గది 3 అనే సినిమా ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఓంకార్ దర్శకుడి గా, తన తమ్ముడు అశ్విన్ బాబు హీరో గా, తమన్నా హీరోయిన్ గా ఈ సినిమా ని పూజ కార్యక్రమాల తో ఘనంగా ప్రారంభం చేశారు. ఈ పూజ వేడుక కు తమన్నా కూడా హాజరైంది. రెండో భాగానికి సమంత, ఇప్పుడు మూడో భాగానికి తమన్నా ని ఓంకార్ బాగానే ఒప్పించాడు అనే టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యం గా తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిందనే వార్తలు ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తున్నాయి. తమన్నా ఈ సినిమా లో ఇప్పుడు భాగం కాదట.

వివరాల్లోకి వెళ్తే, ఆరు నెలల ముందు తమన్నా కి ఈ సినిమా కథ చెప్పినప్పుడు, తమన్నా వెంటనే ఒప్పేసుకుందట. కానీ ఈ సినిమా షూట్ కి వెళ్లే ముందు ఫైనల్ నరేషన్ ఇవ్వమని చెప్పిందట. మొన్న పూజ అయిపోయాక తమన్నా కి ఫైనల్ నేరేషన్ ఇవ్వగా కథ లో భారీ మార్పులు జరిగాయని తమన్నా అర్ధం చేసుకుంది. తనకి కనీసం చెప్పకుండా కథ లో సింహ భాగం మార్చేయడం తో ఇప్పుడు తమన్నా కి ఇంట్రెస్ట్ పోయిందట. అందుకే సినిమా నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -