Thursday, April 25, 2024
- Advertisement -

క్యూలో నిల‌బ‌డి ఓటేసిన త‌మిళ హీరోలు

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు త‌మిళ‌నాడు రాష్ట్రం వేదిక అయింది. ఈ నెల 11న ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసిన సంగ‌తి తెలిసిందే. ద‌శ‌ల వారిగా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు ఈ రోజు(గురువారం) త‌మిళ‌నాడులో జ‌రుగుతున్నాయి. ఉద‌యం ఏడు గంటల నుంచే ప్ర‌జ‌లు క్యూలో నిల‌బ‌డి ఓటు వేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్ర‌జ‌ల‌తో పాటు త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం ఓటు వేసి సామాన్య ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు.

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్‌, సూర్య , కార్తి,జ్యోతిక , శృతి హాస‌న్ వంటి వారు క్యూలో నిల‌బ‌డి మరి ఓట్లు వేశారు. రెండు రాజ‌కీయా దిగ్గ‌జాలు చ‌నిపోయిన త‌రువాత జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో దేశం మొత్తం త‌మిళనాడు వైపే చూస్తున్నాయి. జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి చ‌నిపోయిన త‌రువాత మొద‌ట‌సారి త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవే కావ‌డం గ‌మ‌నర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -