Thursday, April 25, 2024
- Advertisement -

మధు ప్రియ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.. ఏం చేసిదంటే..?

- Advertisement -
Telangana Singer Madhu Priya Re Entry With Fidaa

చాలా చిన్న వయసులోని.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంచి పాటలు పాటి.. అందరినీ ఆకట్టుకుంది తెలుగు అమ్మాయి మధు ప్రియ. ఉద్యమ పాటలే కాకుండా.. ఆడపిల్లా ఆడపిల్లా.. అనే.. పాటతో జనాల మనసులు దోచుకుంది.

అయితే ఎప్పుడు మంచి విషయలతో వార్తల్లో కనిపించిన మధుప్రియ ఆ మధ్య ఓ వివాదంతో మీడియాకెక్కింది. ఇంట్లో ఇష్టం లేకున్న.. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత వేధించాడంటూ మీడియాకెక్కి రచ్చ చేయడం.. ఆ తర్వాత భర్త బంగారం అంటూ మళ్లీ అతడి చెంతకే చేరడం.. ఇలా మధుప్రియ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. అయితే ఆ వివాదం తర్వాత మధుప్రియ వార్తల్లోనే కనిపించలేదు.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పుడు మళ్లీ.. ఓ ప్రముఖ మూవీలో పాట పాడి లైమ్ లైట్లోకి వచ్చింది మధుప్రియ. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ‘ఫిదా’ సినిమా లో ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ ఏసిండే.. అంటూ ఓ పాట అందుకుంది మధు ప్రియ. మధుప్రియ ఇంతకుముందే సినిమా పాటలు పాడింది కానీ.. ఇలా ఓ రెగ్యులర్ సినిమాలో పాట అందుకోవడం ఇదే తొలిసారి. ఇందులో హీరోయిన్ పక్కా తెలంగాణ అమ్మాయి. స్లాంగ్ కూడా అలాగే ఉంటుంది. దానికి తగ్గ వాయిస్ అయితే బాగుంటుందని మధుప్రియతో ఈ పాట పాడించారు. తెలంగాణ కవి సుద్దాల అశోక్ తేజ చక్కటి తెలంగాణ పదాలతో ఈ పాట రాశారు. శ్రీకాంత్ కార్తీక్ అనే కొత్త సంగీత దర్శకుడు ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి ట్యూన్.. మధుప్రియ గాన.. అశోక్ తేజ లిరిక్స్.. అన్నీ బాగానే కుదిరాయి. ఈ పాట విజువల్స్ చూస్తే.. ‘సఖి’లో ఏడే.. ఏడేడే అంటూ సాగే పెళ్లి పాట గుర్తుకు రావడం ఖాయం.

{youtube}A-iLGW__dXY{/youtube}

{loadmodule mod_custom,GA2} 

Related

  1. థర్టీ ఇయర్స్ పృథ్వీ పై భార్య కేసు.. కోర్టు ఏం చెప్పింది..?
  2. చంద్ర‌బాబు.. ఒక్క‌ విందుకు ఏంత ఖర్చు పెట్టారో తెలుసా..?
  3. రవితేజ తమ్ముడితో.. పోసానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
  4. మోసంచేసిన ప్రియుడిది ఏం కోసిందో తెలుసా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -