Tuesday, April 23, 2024
- Advertisement -

టీవీ సీరియల్స్ లో నటిస్తూ పెళ్లి చేసుకున్నది వీళ్ళే..!

- Advertisement -

సినిమాల్లో నటించే నటీనటులకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో బుల్లితెరపై నటించే నటీనటులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అయితే సినిమాల్లో నటించిన కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలానే బుల్లితెరపై కూడా కొందరు నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వారెవరో ఇప్పుడు చూద్దాం. మనసు మమత సీరియల్ లో నటించిన ప్రియతమ్ చరణ్, మానస ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అలానే చంద్రముఖి సీరియల్ లో నటిస్తున్నప్పుడు పరిటాల నిరుపమ్, మంజుల ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మహేశ్వరీ, శివనాగ్ జంట కూడా పెళ్లి చేసుకున్నారు.

అయితే శివనాగ్ ఆర్టీస్ట్ కాకునా ఎన్నో సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. శశిరేఖ పరిణయం,పెళ్ళినాటి ప్రమాణాలు తదితర సీరియల్స్ లో పనిచేస్తున్న సమయంలో ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి మరీ ఆర్య సమాజ్ లో పెళ్లిచేసుకున్నారు. అపరంజి, అనుబంధాలు, ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్, వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కల్సి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని పెళ్లాడింది.

అభిషేకం ,ఇద్దరమ్మాయిలు సీరియల్స్ లో కల్సి నటించిన విష్ణు ప్రియా,సిద్ధార్ధ పెళ్లి బంధంతో నిజ జీవితంలో ఒకటయ్యారు. వైదేహి,సంఘర్షణ,కలవారి కోడలు,మనసు తదితర సీరియల్స్ లో కల్సి నటించిన హరిత,జాకీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -