తమిళనాడు ప్రజల అభిమానం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. వారికి ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కవ. ఒకరని అభిమానించడం మొదలుపెడితే చచ్చే వరకు వారి మీద అభిమానం పెంచుకుంటునే ఉంటారు. ఇక ఈ విషయంలో సినీ హీరోల అభిమానులు అయితే ఓ మెట్టుపైనే ఉంటారు. ఇప్పుడు ఈ అభిమానం ప్రాణాలు తీసుకునే వరకు వరకు చేరింది.
తమిళనాడు స్టార్ హీరోలైన రజినీకాంత్ , ‘పేట’ ,అజిత్ ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియోటర్ల దగ్గర హీరోల అభిమానులు హల్ చల్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో అభిమానులు అధిపత్యం కోసం ప్రయత్నించారు.ఈ సందర్భంగా జరిగిన గొడవ తారా స్థాయికి చేరుకుంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా సృష్టించారు.తమ హీరో గొప్ప అంటే ,తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.
వేలూరులోని ఓ థియేటర్ అభిమానులు కత్తులతో ,కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటోందో తమిళ తంబిలకు తెలిసోచ్చింది అయిన హీరోలు బాగానే ఉంటారు,మధ్యలో ఈ ఫ్యాన్స్కు వచ్చిన నొప్పి ఏంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. అభిమానం హద్దులలో ఉంటే ఎవరికైన బాగానే ఉంటోంది. అభిమానం హద్దులు దాటితే ఇదిగో ఇలా ఉంటోందని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం అని చెప్పవచ్చు.
- Advertisement -
కత్తులతో పొడుచుకున్న హీరోల అభిమానులు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -