వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం రాజకీయంగా పలు ఆరోపణలు చేసి రాజకీయ నేతల ఆగ్రహానికి గురవుతున్న సంగతి తెలిసిందే.. శివసేన తో ఆమె వైరం ఇప్పట్లో తగ్గేలా లేదు.. వారి ఏ విమర్శలు చేసిన వారికి తగ్గట్లు సమాధానమిస్తూ ఇంకా రెచ్చగొడుతుంది.. అయితే మొదటినుంచి ఆమె వైఖరి తెలిసిన వారికి ఇది కామన్ అనిపించిన రాజకీయంగా ఈ వైఖరి ఆమె మనుగడకు మంచిది కాదని ఆమె అభిమానులు పేర్కొంటున్నారు.. ఆమెకు ప్రస్తుతం ఒక్కో షాక్ తగులుతుండగా, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్అధికారులు కూడా షాక్ ఇచ్చారు.
ఆమెకు చెందిన అక్కడి పాళి హిల్ బంగ్లాకు మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించడం చర్చనీయాంశమైంది. ఈ బంగ్లాను మణికర్ణిక ఆఫీసు పేరుతో కంగనా కట్టించుకుంది. ఈ కార్యాలయం వేదికగానే ఆమె సినిమాలు నిర్మిస్తోంది. ముంబైలోని తన కార్యాలయాన్ని అధికారులు కూల్చబోతున్నట్లు కంగనా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిన్న ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బీఎంసీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. బీఎంసీ అధికారులు అందులోకి బలవంతంగా చొరబడ్డారని, అన్ని కొలతలు చూసుకున్నారని కంగనా మరోసారి ఫైర్ అయ్యింది. తన ఆఫీసుకు సంబంధించి అక్రమాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.అయితే, మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించామని అధికారులు అంటున్నారు.. తమకు ఆ కట్టడంపై వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు.