Friday, March 29, 2024
- Advertisement -

పాయల్ ని రేప్ చేయబోయిన డైరెక్టర్..?

- Advertisement -

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత వ‌రుస వివాదాల‌తో బాలీవుడ్ షేక్ అవుతోంది. ఇండ‌స్ట్రీకి చెందిన వారంతా గ్రూపులుగా విడిపోయి సోష‌ల్ మీడియా వేదిక‌గా కొట్టుకుంటున్నారు. తాజాగా న‌టి పాయ‌ల్ ఘోష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ త‌న‌ను బ‌ల‌వంతం చేయ‌బోయాడ‌ని, త‌న ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్యక్తం చేసింది. ప్ర‌ధాని మోదీ జోక్యం చేసుకుని ఈ విష‌యంలో చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరింది. సృజ‌నాత్మ‌క‌త ముసుగు క‌ప్పుకున్న‌ అనురాగ్ క‌శ్య‌ప్‌లోని రాక్ష‌స కోణాన్ని చూపెట్టాల‌ని అభ్య‌ర్థించింది. ఈ విష‌‌యాన్ని బ‌య‌ట పెట్ట‌డం త‌న‌కు ముప్పు తెచ్చిపెడుతుంద‌ని త‌న‌కు తెలుసని.. ద‌య‌చేసి సాయం చేయాల‌ని కోరింది. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ, పీఎంవో ఆఫీస్ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌ను పాయ‌ల్ ఘోష్ ట్యాగ్ చేసింది.

పాయ‌ల్ ఘోష్ ట్వీట్ చేసి నేష‌న‌ల్ ఉమెన్ క‌మిష‌న్ స్పందించింది. పూర్తి వివ‌రాల‌తో ఫిర్యాదు చేయాల‌ని సూచించింది. దానిపై విచారిస్తామ‌ని తెలిపింది. పాయ‌ల్ ఘోష్ అవివ‌రాలు అందిస్తాన‌ని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -