గౌతం మీనన్ దర్సకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో అంటూ కొత్త సినిమా తో సిద్దం అవుతున్న అక్కినేని నాగ చైతన్య అది పూర్తి అవ్వగానే మరొక నాలుగు రోజుల్లో ప్రేమం సినిమా రిమేక్ గా వస్తున్న ‘ మజ్ను’ షూటింగ్ కి వెళ్ళిపోతాడు. ఈ సినిమా ని కార్తికేయ సినిమా దర్శకుడు చందూ దర్సకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తం ముగ్గురు హీరోయిన్ లు ఉన్న ఈ సినిమా లో శృతి , అనుపమ లు మెయిన్ హీరోయిన్ లు గా సెలెక్ట్ అయ్యారు. మూడవ హీరోయిన్ కోసం డైరెక్టర్ మొన్నటి నుంచీ వెతుకుతూ ఉండగా చిరుత సినిమా ఫేం నేహా శర్మ చెల్లెలు ఇషా శర్మ ని ఓకే చేసారు .ఇప్పటికే ఇషా సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’కి కూడా సైన్ చేసింది.
మరోవైపు పూరి జగన్నాధ్ ‘రోగ్’ కోసం కూడా ఈ భామని పరిశీలిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.