Thursday, April 25, 2024
- Advertisement -

ఆసుప‌త్రిలో చేరిన టాలీవుడ్ సెన్సేషన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ …

- Advertisement -

అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హాస్పిటల్ హాస్ప‌ట‌ల్‌లో చేరిన‌ట్లు ఫిల్మ్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తున్నాయి. హోలీ సంబరాల్లో మునిగితేలిన విజయ్ బాగా నీరసించిపోవడంతో ఫీవర్ వచ్చి హాస్పటల్‌లో అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది.

వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడపడం.. హోలీ సెలబ్రేషన్స్‌లో ఒకేసారి శారీరక ఒత్తిడి కలగడం జ్వరం వచ్చిందని రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని విజయ్ సన్నిహితులు అంటున్నారు. ఒక్కోసారి మనం చిన్న విషయయమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పెద్దదయి కూర్చుటుంది. అసలే ప్యాక్డ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న విజయ్ మళ్ళీ తన కారణంగా షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అలా హాస్పిటల్ లో జాయిన్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీగా ఉంది. రష్మిక, విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రెండోసారి జోడీ కట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆ తరవాత ‘డియర్ కామ్రేడ్’ పెండింగ్ షూట్ లో పాల్గొంటాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -