Saturday, April 20, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’ సెట్‌లో ఓ వ్య‌క్తి మృతి

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజాగా న‌టిస్తున్న చిత్రం మ‌హర్షి. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా టాకింగ్ పార్ట్ పూర్తి అయింది. రెండు పాటలు మినహా సినిమా పూర్తి అయింది. అయితే ఈ సినిమాలోని పాట కోసం వేస్తున్న సెట్టింగ్‌లో అప‌శృతి చోటు చేసుకుంది. సినిమాలోని సాంగ్ సెట్ కోసం ప‌ని చేస్తోన్న ఓ కార్మికుడు ప్ర‌మాదవశాత్తు మ‌ర‌ణించ‌డం సంచ‌ల‌నంగా మారింది. కార్పెంటర్ కృష్ణారావు తెలుగు సినిమా సెట్టింగ్‌ల‌కు ప‌ని చేస్తుంటాడు. అలాగే మ‌హేశ్ బాబు న‌టిస్తున్న మ‌హ‌ర్షి సినిమా కోసం కూడా ప‌ని చేస్తున్నాడు.

బుధవారం యథావిధిగా పనుల్లో నిమగ్నమైన కృష్ణారావు సెట్ కోసం మెషీన్ తో చెక్కలు కట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో అతనికి షాక్ తగలడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంట‌నే అత‌నని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే కృష్ణారావు మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. దీంతో సినిమా కార్మికులు ధ‌ర్నాకు దిగారు. చిత్ర నిర్మాత దిల్ రాజు కృష్ణారావు కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని వారు ధ‌ర్నా చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -