Friday, March 29, 2024
- Advertisement -

ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజ‌యం సాధించిన న‌టి హేమ‌

- Advertisement -

టాలీవుడ్ లేడీ ఆర్టిస్ట్‌ల‌లో న‌టి హేమ ముందు వ‌రుస‌లో ఉంటారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుంచో సినిమాలు చేస్తు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది హేమ‌. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైన క‌ష్టం వ‌చ్చిందంటే ముందు ఉంటోంది హేమ‌. మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో కూడా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పోటీ చేసి విజ‌యం సాధిస్తు వ‌స్తున్నారు. ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన మా ఎన్నిక‌ల‌లో కూడా ఆమె పోటీ చేశారు. అయితే ఈసారి ఏ ప్యానెల్ త‌రుపున నిల‌బ‌డ‌కుండా స్వంతంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి మ‌రి విజ‌యం సాధించారు. ఆమె ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే హేమ ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారో తెలియాల్సి ఉంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల త‌రువాత ఆమె మీడియాతో మాట్లాడుతు… న‌లుగురు మగ‌వాళ్ల‌ను ఓడించి నేను విజ‌యం సాధించాన‌ని తెలిపింది. త‌న‌కు ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్క్షత‌లు తెలిపింది హేమ‌. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతు త‌న‌పై పెట్టుకున్న నమ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. 2019గాను జ‌రిగిన మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో న‌టుడు న‌రేశ్ ప్యానెల్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. త‌న తోటి న‌టుడు శివాజీ రాజాపై న‌రేశ్ 68 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -